వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫలించని భారత్‌బౌలింగ్‌ఃజింబాంబ్వే 248/8

By Staff
|
Google Oneindia TeluguNews

నాగ్‌ పూర్‌ః భారత్‌ బౌలింగ్‌ లోపాలను సొమ్ము చేసుకొని జింబాంబ్వే బ్యాట్స్‌ మెన్‌ చెప్పుకోతగ్గ స్కోరు సాధించారు. 8వికెట్లు కోల్పోయి 248 పరుగులు సాధించారు. కెప్టెన్‌ కార్లయిల్‌ 75 పరుగులు సాధించగా మాజీ కెప్టెన్‌ క్యాంప్‌ బెల్‌ 50 పరుగులు చేశాడు. ఫ్రెండ్‌ 31 బంతుల్లో 33 పరుగులతో నాటౌట్‌ గా వున్నాడు. మరో మాజీ కెప్టెన్‌ హీత్‌స్ట్రీక్‌ 21 పరుగులు సాధించి అవుటయ్యాడు. భారత్‌ బౌలర్లలో జహీర్‌ఖాన్‌ 3, కుంబ్లే 3 వికెట్లు సాధించగా, శ్రీనాధ్‌ కు ఒకవికెట్‌ లభించింది. ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ కువికెట్లేమీ లభించలేదు.

మరో ఐదు ఓవర్లుమిగిలి వుండగా కెప్టెన్‌ గంగూలీ కొత్తబంతి తీసుకోవడం ఫలించింది. జహీర్‌ఖాన్‌ వేసిన బంతిని ఏమరుపాటుగా ఆడిన హీత్‌స్ట్రీక్‌ దాస్‌ కు దొరికిపోయాడు. శ్రీనాధ్‌ బౌలింగ్‌ లో పూర్తిగా పసలోపించినట్లు కనిపిస్తున్నది. మరోసీమర్‌ సంజయ్‌ బంగర్‌ కూడా చెప్పుకోగ్గ రీతిలో బౌలింగ్‌ చేయలేక పోయాడు. జహీర్‌ఖాన్‌ ఒక్కడే జింబాంబ్వే బ్యాట్స్‌ మెన్‌ ను కాస్త ఇబ్బందిపెట్టగలిగారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X