వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంగూలీ విజృంభణ - భారత్‌ 319/6

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః ఫిరోజ్‌ షా కొట్లా మైదానంలో భారత కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ, ఢిల్లీ యువకెరటంవీరేంద్ర సెహవాగ్‌ విజృంభంచారు. గంగూలీ టెస్టుల్లో తన ఏడోసెంచరీ పూర్తి చేసుకోగా సెహవాగ్‌ 74 పరుగులు చేసి ఔటయ్యాడు. వెలుతురు సరిగా లేని కారణంగా మ్యాచ్‌ మందకోడిగా సాగింది. ఉదయం ఆటంతా దాదాపు రద్దయింది. 171 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన గంగూలీ,సెహవాగ్‌ విజృంభించి ఆడారు.

జోరుగా ఆడుతున్నసెహవాగ్‌ హీత్‌ స్ట్రీక్‌ బౌలింగ్‌ లో అవుటయ్యాడు. అతడు 118 బంతుల్లో 15 ఫోర్లతో 74 పరుగులు చేశాడు.సెహవాగ్‌ ఆడుతున్నంత సేపు ఫిరోజ్‌ షా కొట్లా మైదానంఅంతా కేరింతలతో మారుమోగిపోయింది. ఆతరువాత బరిలోకి దిగిన మరో యువఆటగాడు సంజయ్‌ బంగర్‌ నాలుగుపరుగులకే రనౌట్‌ అయ్యాడు. కెప్టెన్‌ గంగూలీసరైన సమయంలో ఫామ్‌ లోకి వచ్చాడు. 279 బంతుల్లో 21 ఫోర్లు ఒకసిక్స్‌ తో 139 పరుగులు చేసి నాటౌట్‌ గా నిలిచాడు. గంగూలీకి కుంబ్లే మంచి మద్దతు ఇచ్చాడు.

19 పరుగులుతో కుంబ్లే నాటౌట్‌ గా నిలిచాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి జింబాంబ్వే స్కోరు కంటే భారత్‌ ఇంకా 9 పరుగులు వెనకపడి వుంది. కాస్త నెమ్మదిగా ఆడిస్వల్ప ఆధిక్యం సంపాదించినా పిచ్‌ స్పిన్‌ అయ్యే అవకాశాలున్నాయి కాబట్టి భారత్‌ కువిజయావకాశం వుంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X