350కి చేరిన గుజరాత్‌ మృతులసంఖ్య

అహ్మదాబాద్‌ః గుజరాత్‌ మంటలు ఇంకా చల్లారలేదు. మతఘర్షణల మారణహోమంలో అమయాకులు కాలిబూడిదవుతున్నారు. అనధికారఅంచనాల ప్రకారం శనివారం మధ్యాహ్నం వరకు 350 మంది మరణించినట్లు భావిస్తున్నారు. మతఘర్షణలు కొత్త ప్రాంతాలకు కూడా విస్తరిస్తుండడంతో వేలాది మందిసైన్యాలను రంగంలోకి దించుతున్నారు. వడోదరలోని ఓ బేకరీలో పనిచేసే ఏడుగురిని శనివారంఉదయం సజీవ దహనం చేశారు. మెహ్‌సేన జిల్లాలోని సర్దార్‌ పూర్‌ లో 27 మంది మతఘర్షణల్లోమరణించినట్లు పోలీసులు ధృవీకరించారు.

లాడోల్‌ పట్టణంలోశనివారం ఇద్దరిని పొడిచి చంపారు. అహ్మదాబాద్‌,భావ్‌ నగర్‌, సూరత్‌ లో శనివారం ఉదయం కూడాఅల్లర్లు చెలరేగాయి. కొన్ని చోట్లు పోలీసులు కాల్పులుజరిపాల్సిన పరిస్థితి తలెత్తింది. విధ్వంసంసృష్టిస్తున్న వారిపై కాల్పులు జరపడంతో ఇద్దరుమరణించినట్లు భావ్‌ నగర్‌ ఎస్‌.పి. చెప్పారు.అహ్మదాబాద్‌ లో ఇరువర్గాలకు చెందిన యువకులుపరస్పరం రాళ్ళు రువ్వుకుంటూ విధ్వంస కాండకొనసాగిస్తున్నారు. సూరత్‌ లోని కొన్ని ప్రాంతాల్లో కూడాకర్ఫ్యూ విధించారు.

నాలుగు రోజుల విధ్వంసానికి భయపడి ప్రజలుఇళ్ళ నుంచి బయటకు రావడం మానేశారని,పుకార్లతో ప్రజలు కలవరపడిపోతున్నారని పోలీసులువివరించారు. శుక్రవారం రాత్రి గోద్రా గ్రామంలో ఓవర్గానికి చెందిన 30 మందిని సజీవదహనంచేసిన సంఘటన సంచలనం కలిగించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+