వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎస్‌ఐ పాత్ర- కీలక వ్యక్తిఅరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

కోల్‌కత్తా: గుజరాత్‌లోని గోద్రాలో సబర్మతిఎక్స్‌ప్రెస్‌పై దాడికి పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ కుట్ర పన్నినట్లు తేలింది. ఐఎస్‌ఐ ప్రోద్బలంతో ఉగ్రవాద సంస్థ హర్కతుల్‌జిహాదే ఇస్లామి దాడికి పథకం వేసినట్లు సమాచారం.వీరి కుట్రలో ప్రభుత్వ నిషేదానికి గురైన ఒకవిద్యార్థి సంస్థ కీలక పాత్ర పోషించింది.

ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి హర్కతుల్‌ డిప్యూటీ కమాండర్‌ను పశ్చిమ బెంగాల్‌- బీహార్‌ సరిహద్దుల్లో పోలీసులుఅరెస్టు చేశారు. అతను బంగ్లాదేశ్‌ పారిపోవడానికి పశ్చిమ బెంగాల్‌లో ప్రవేశిస్తుండగాఅరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. అతను ఒక ప్యాసింజర్‌రైలులో వస్తున్నాడని తెలుసుకున్న పోలీసుస్పెషల్‌ టాస్క్‌ ఫోర్సు బృందం వలపన్ని పట్టుకుంది. పాక్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ప్రోద్బలంతో తమ సంస్థే సబర్మతిఎక్స్‌ప్రెస్‌పై దాడికి పథకం వేసిందని అతను ఇంటరాగేషన్‌లోఅంగీకరించినట్లు అధికారులు తెలిపారు. ఇతను చెప్పినవివరాల ఆధారంగా ఇతర నిందితులను పట్టుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇంటలిజెన్స్‌ సంస్థలు, పోలీసు వర్గాలు, సిబిఐ కలిసికట్టుగా కృషి చేస్తున్నట్లు చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X