వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రత్యూష హంతకులు సిద్దార్థ తల్లిదండ్రులే
హైదరాబాద్ః తన కుమార్తె ప్రత్యూషను సిద్దార్థ రెడ్డి తల్లిదండ్రులే హత్య చేయించారని ఆమె తల్లి సరోజినీ దేవి ఆరోపించారు. సిద్దార్థ రెడ్డిని కేర్ ఆస్పత్రి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అతని నుంచిస్టేట్ మెంట్ తీసుకోవాలని శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆరోపించారు. సిద్దార్థ అతనిస్నేహితులపై తనకు మొదటి నుంచి అనుమానంగా వున్నదని సరోజినీ దేవి ఆరోపించారు. సిద్దార్థ నుంచి ఇంత వరకుస్టేట్ మెంట్ తీసుకోకుపోవడానికి కారణం ఏమిటని ఆమె ప్రశ్నించారు. కొనప్రాణాలతో వున్న ప్రత్యూషను చూసేందుకు కేర్ ఆస్పత్రి వారు నన్ను కూడా అనుమతించలేదని, అయితే సిద్దార్ధరెడ్డి ఐ.సి.యు.లో, కోమాలో వున్నారని చెబుతున్నప్పటికీ అతని వద్దకు బంధుమిత్రులు వచ్చివెళుతునే వున్నారని సరోజినీ దేవి ఆరోపించారు.
Comments
Story first published: Saturday, March 2, 2002, 23:53 [IST]