వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యూష హంతకులు సిద్దార్థ తల్లిదండ్రులే

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః తన కుమార్తె ప్రత్యూషను సిద్దార్థ రెడ్డి తల్లిదండ్రులే హత్య చేయించారని ఆమె తల్లి సరోజినీ దేవి ఆరోపించారు. సిద్దార్థ రెడ్డిని కేర్‌ ఆస్పత్రి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అతని నుంచిస్టేట్‌ మెంట్‌ తీసుకోవాలని శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆరోపించారు. సిద్దార్థ అతనిస్నేహితులపై తనకు మొదటి నుంచి అనుమానంగా వున్నదని సరోజినీ దేవి ఆరోపించారు. సిద్దార్థ నుంచి ఇంత వరకుస్టేట్‌ మెంట్‌ తీసుకోకుపోవడానికి కారణం ఏమిటని ఆమె ప్రశ్నించారు. కొనప్రాణాలతో వున్న ప్రత్యూషను చూసేందుకు కేర్‌ ఆస్పత్రి వారు నన్ను కూడా అనుమతించలేదని, అయితే సిద్దార్ధరెడ్డి ఐ.సి.యు.లో, కోమాలో వున్నారని చెబుతున్నప్పటికీ అతని వద్దకు బంధుమిత్రులు వచ్చివెళుతునే వున్నారని సరోజినీ దేవి ఆరోపించారు.

సిదార్ధరెడ్డి మాట్లాడే పరిస్థితిలోనే వున్నారని అతని నుంచిస్టేట్‌ మెంట్‌ తీసుకుంటే ప్రత్యూష హంతకులెవరో బయటపడుతుందని ఆమె అన్నారు. పోలీసులు సిదార్ధరెడ్డిని ఎందుకు ఇలా వెనకేసుకొస్తున్నారనేది సమాధానం లేని ప్రశ్నగామిగిలిపోయింది. ఆస్పత్రిలో చేరినప్పుడు ప్రత్యూష కట్టుకున్న చీరను కూడా కేర్‌ ఆస్పత్రి వారు తనకుఅప్పగించాల్సిందిగా సరోజినీ దేవి ఆరోపించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో సరోజినీ దేవి చేసిన ఆరోపణలు పత్యూష కేసును కొత్తమలుపు తిప్పుతాయని భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X