వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారత్ పరువు గంగపాలుః వాజ్పేయి
న్యూఢిల్లీః గుజరాత్ అల్లర్లు యావత్ భారత జాతి సిగ్గుతో తలదించుకొనే విధంగా పరిణమించాయని ప్రధాని వాజ్పేయి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మారణకాండను ఎట్టిపరిస్థితుల్లోను అణచివేస్తామని వాజ్పేయి ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్ కల్లోలం ప్రపంచ దేశాల ఎదుట భారత్ సిగ్గుతో తలదించుకొనే పరిస్థితి కల్పించాయని దూరదర్శన్ లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వాజ్పేయి అన్నారు. గతంలో పలు సంక్షోభాలను అధిగమించిన భారత్ ఈ సారి కూడా ఈసంక్షోభం నుంచి బయటపడుతుందని శనివారం జాతినుద్దోశించి చేసిన ప్రసంగంలో వాజ్పేయి అన్నారు.
Story first published: Saturday, March 2, 2002, 23:53 [IST]