వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌ పరువు గంగపాలుః వాజ్‌పేయి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః గుజరాత్‌ అల్లర్లు యావత్‌ భారత జాతి సిగ్గుతో తలదించుకొనే విధంగా పరిణమించాయని ప్రధాని వాజ్‌పేయి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మారణకాండను ఎట్టిపరిస్థితుల్లోను అణచివేస్తామని వాజ్‌పేయి ధీమా వ్యక్తం చేశారు. గుజరాత్‌ కల్లోలం ప్రపంచ దేశాల ఎదుట భారత్‌ సిగ్గుతో తలదించుకొనే పరిస్థితి కల్పించాయని దూరదర్శన్‌ లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వాజ్‌పేయి అన్నారు. గతంలో పలు సంక్షోభాలను అధిగమించిన భారత్‌ ఈ సారి కూడా ఈసంక్షోభం నుంచి బయటపడుతుందని శనివారం జాతినుద్దోశించి చేసిన ప్రసంగంలో వాజ్‌పేయి అన్నారు.

అన్ని వర్గాలకు చెందిన ప్రజలు సామరస్యంతో మెలగాలంని వాజ్‌పేయి విజ్ఞప్తి చేశారు. తనతో పాటు దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ఆకాంక్ష కూడా ఇదేనని ఆయన అన్నారు. ఎవరు ఎన్ని విధాల రెచ్చగొట్టినా ప్రజలు సంయమనం పాటించాల్సిందిగా వాజ్‌పేయి పిలుపునిచ్చారు. శుక్రవారం అఖిలపక్ష నేతలతో గుజరాత్‌సంక్షోభం గురించి చర్చించిన వాజ్‌ పేయి ఆ తరువాత రాష్ట్రపతిని కలుసుకున్నారు. గుజరాత్‌ పరిస్థితిపై రాష్ట్రపతితో వాజ్‌పేయి అరగంటకు పైగా వివరించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X