దారి పొడవునా కన్నీటి ధారలు
అమలాపురంః దివంగత నేత బాలయోగి భౌతిక కాయం రాజమండ్రి నుంచి అమలాపురం మీదుగా సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఆయన స్వగ్రామం ఎదుర్లంక గ్రామానికి చేరుకున్నది. బాలయోగి భౌతిక కాయాన్ని వుంచిన ప్రత్యేక వాహనం ఎదుర్లంక చేరుకోగానే ఆ ఊరు పుత్రశోకం గోదావరి వరదే అయింది.ఊరుఊరంతా విలపిస్తుంటే ఓదార్చేవారు లేకుండా పోయారు. రాజమండ్రి నుంచి ఎదుర్లంకకు చేరుకోవడానికి పదిహేను గంటలు పైగా పట్టింది. ఎదుర్లంక వరకు దాదాపుఅన్ని గ్రామాల్లోనూ ప్రజలు స్పీకర్ భౌతిక కాయం కోసం ఎదురుచూస్తూ రహదారుల కిరువైపుల వేల సంఖ్యలో నిలబడ్డారు. దారిపొడవునా అశ్రుతర్పణాలు వదిలారు.












Click it and Unblock the Notifications
