వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోర్టు తీర్పును గౌరవిస్తాంః వి.హెచ్‌.పి.

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః అయోధ్య వ్యవహారంలో న్యాయస్థానం తీర్పుకు కట్టుబడి వుంటామనివిశ్వహిందూ పరిషత్‌ ప్రకటించింది. కోర్టు తీర్పువచ్చినా రాకపోయినా మార్చి 15న ఆలయనిర్మాణానికి సన్నాహాలు చేస్తామని మొండికేసిన వి.హెచ్‌.పి. గురువారం దిగివచ్చింది. అయోధ్యవివాదంపై న్యాయస్థానం తీర్పును అంగీకరిస్తామంటూ వి.హెచ్‌.పి. గురువారం ప్రధాని వాజ్‌పేయికి లిఖితపూర్వక హామీ ఇచ్చింది.

వి.హెచ్‌.పి. అంతర్జాతీయ అధ్యక్షుడుఅశోక్‌ సింఘాలు గురువారం హడావుడిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఫిబ్రవరి 27న రామజన్మభూమిట్రస్ట్‌ ప్రధానికి ఇచ్చిన హామీకి అనుగుణంగా తాము కూడా అయోధ్యవివాదంపై కోర్టుతీర్పుకు కట్టుబడి వుంటామని ప్రకటించారు. అయోధ్యవివాదంపై కంచిపీఠాధిపతి మధ్యవర్తిత్వానికి వి.హెచ్‌.పి. ఉపాధ్యక్షుడు గిరిరాజ్‌ కిషోర్‌ అడ్డుపుల్ల వేశారు. ప్రభుత్వంతో ఎటువంటి ఒప్పందం కుదరలేదని గిరిరాజ్‌ కిషోర్‌ ప్రకటించిన రెండు రోజుల తర్వాతఅశోక్‌ సింఘాల్‌ ఇలా ప్రకటించడం విశేషం.

మార్చి 15న వివాదాస్పద స్థలానికి నిర్మాణ సామగ్రిన తరలిస్తారా అనివిలేకరులు ప్రశ్నించగా ఏ కార్యక్రమమైనా శాంతియుతంగా, భక్తిప్రపత్తులతో నిర్వహిస్తామని సింఘాల్‌ చాలా సౌమ్యంగా వెల్లడించారు. నిన్నటివరకు నిప్పులు చెరిగిన వి.హెచ్‌.పి.లో హఠాత్తుగా ఈ మార్పురావడానికి కారణం ఏమిటనేది ఆశ్చర్యంగా మారింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X