వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారి తప్పినజాతీయ ఎజెండా: పివి

By Staff
|
Google Oneindia TeluguNews

గుంటూరు: జాతీయ ఎజెండాను ఆర్థిక రంగం వైపు మళ్లించాల్సిన అవసరం ఉన్నదని మాజీ ప్రధానిపి.వి. నరసింహారావు అన్నారు. గుంటూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన సోమవారం నాడు ప్రసంగించారు.

జాతీయ ఎజెండా ఇతరేతర రంగాల వైపు మళ్లిందని ఆయన అభిప్రాయపడ్డారు. మత రాజకీయాలను పక్కనపెట్టి జాతీయ ఎజెండాను ఆర్థిక రంగం వైపు మళ్లించడం నేటి అవసరమని ఆయన అన్నారు.

తన ప్రభుత్వం 1991లో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఎజెండాను పక్కనపెట్టారని ఆయన చెప్పారు. ఇదే పద్ధతి కొనసాగితే దేశానికి చేటు కాలం దాపురిస్తుందని ఆయన అన్నారు. శాంతిభద్రతలకు, మత సామరస్యానికి సంబంధించిన సమస్యలు ముందుకు వస్తుంటే ప్రశాంతంగా కూర్చుని చేయాల్సిన పనుల గురించి ఆలోచన వుండదని, ఆలోచన ఉన్నా ఆ పనులు చేయలేమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X