వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీ ప్రారంభం-కరణంకు నివాళి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. పదిరోజుల పాటు జరిగే ఈ సమావేశాలు ప్రారంభం కాగానే ఇటీవల అనారోగ్యంతో మరణించినవిద్యాశాఖ మంత్రి కరణం రామచంద్రరావు మృతికి సభ సంతాపం తెలిపింది. సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరణం మృతికి సంతాపం తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు.

అనంతరం ఆయన మాట్లాడుతూవిద్యారంగం అభివృద్ధికి కరణం ఎనలేని సేవచేశారని, మెదక్‌ జిల్లా అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసినసేవ చిరస్మరణీయమైనదని అన్నారు. సర్పంచ్‌ నుంచి ఎదిగి, ఐదుసార్లు రాష్ట్రఅసెంబ్లీకి ఎన్నికైన కరణం రామచంద్రరావువిద్యాశాఖకు, పంచాయతీ రాజ్‌ శాఖకు ఎనలేని సేవలు చేశారని చెప్పారు. కరణంసేవలను బిజెపి పక్ష నాయకుడు ఇంద్రసేనారెడ్డి, సిపిఎం నేత నోముల నర్సింహయ్య, టి.ఆర్‌.ఎస్‌. అధినేత చంద్రశేఖర రావులు కొనియాడారు. కరణం మృతికి సభ రెండు నిముషాలు మౌనం పాటించింది. ఆ తరువాత సభ మంగళవారం నాటికి వాయిదా పడింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X