వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రూ.611 కోట్ల సాయానికి బాబువిజ్ఞప్తి
న్యూఢిల్లీ:
కరవు
సహాయ
చర్యలకు
611
కోట్ల
రూపాయలు
ఇవ్వాలని
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబునాయుడు
కేంద్ర
ప్రభుత్వాన్నికోరారు.
ఆయన
గురువారం
ప్రధాని
అటల్
బిహారీ
వాజ్పేయిని
కలిసి
ఈవిజ్ఞప్తి
చేశారు.
రాష్ట్రపతిగా అబ్దుల్ కలామ్ ప్రమాణ స్వీకారోత్సవానికిహాజరు కావడానికి ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీని కలుసుకున్నారు. న్యాయశాఖ మంత్రి జనా కృష్ణమూర్తిని కూడా ఆయన కలుసుకున్నారు. మర్యాదపూర్వకంగానే ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులను కలుసుకున్నట్లు రాజకీయవర్గాలు చెప్పాయి.రైల్వే మంత్రి నితీష్ కుమార్తో కూడా ఆయన సమావేశమయ్యారు. ఆగ్నేయరైల్వే జోన్ను భువనేశ్వర్కు మార్చవద్దని ఆయన నితీష్ కుమార్నుకోరారు. రైల్వే అంశాల అధ్యయనానికి రాష్ట్రానికి ఒక నిపుణుల బృందాన్ని రాష్ట్రానికి పంపుతామని నితీష్ కుమార్ చెప్పారు.
Comments
Story first published: Thursday, July 25, 2002, 23:53 [IST]