వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పనికి ఆహారంపై దర్యాప్తునకు నో

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పనికి ఆహార పథకం అమలులో జరుగుతున్న అవకతవకలపై దర్యాప్తు జరపాలనే కాంగ్రెస్‌ డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించింది. ఇందుకు నిరసనగా కాంగ్రెస్‌ సభ్యులు గురువారం శాసనసభ నుంచి వాకౌట్‌ చేశారు.

మిల్లర్లు, కాంట్రాక్టర్లు, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) అధికారులు కుమ్మక్కయి పనికి ఆహారం పథకం కింద వచ్చిన బియ్యంరీసైకిలింగ్‌కు పాల్పడుతున్నారని, పనికి ఆహార పథకం కింద వచ్చిన బియ్యాన్ని కాంట్రాక్టర్ల నుంచిమిల్లర్లు, మిల్లర్ల నుంచి ఎఫ్‌సిఐ అధికారులు కొనుగోలు చేస్తున్నారని, ఆ బియ్యం లబ్ధిదారులకుఅందడం లేదని కాంగ్రెస్‌ విమర్శించింది. రీసైకిలింగ్‌ వల్ల పనికి ఆహార పథకం నీరు గారిపోతోందని ప్రతిపక్ష నేత డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డివిమర్శించారు. ఈ అవకతవకలపై అన్ని జిల్లాల్లో దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌ డిమాండ్‌ను హోం మంత్రి టి. దేవేందర్‌ గౌడ్‌ తిరస్కరించారు. అవకతవకలు జరిగిన సంఘటనలను తమ దృష్టికి తెస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. మంత్రి సమాధానానికి సంతృప్తి చెందని కాంగ్రెస్‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X