వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

23మంది డాక్టర్లున్నావైద్యం కరవే!

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ఃరాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్‌.రాజశేఖర రెడ్డితో పాటు 23 మంది డాక్టర్లు వున్నారని,అయినప్పటికీ రాష్ట్ర ప్రజలకు సరిగా వైద్యం అందడంలేదని ఎమ్మెల్ల్యేలు ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ,వైద్యుల నిర్లక్ష్యంపై తెలుగుదేశంతో సహాపలుపార్టీలకు చెందిన సభ్యులు నిరసనవ్యక్తం చేశారు. గ్రామాల్లో ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు సవ్యంగా పనిచేసేలా ప్రభుత్వం ఎందుకుచర్యలు తీసుకోలేక పోతున్నదని వారు ప్రశ్నించారు.

ఇందుకు రాష్ట్రవైద్య శాఖ మంత్రి నాగం జనార్దన్‌ రెడ్డి మాట్లాడుతూరాష్ట్రంలో 24 గంటలు పనిచేసే ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు గతంలో 285 వుండేవన్నారు. వాటిని450కి పెంచామని, వాటిలో సౌకర్యాలు కూడా పెంచామనిఆయన చెప్పారు. ప్రతి ఆస్పత్రిలో టెలిఫోన్‌, అత్యసవసరసామాగ్రి తెచ్చేందుకు ఒక వాహనం, అనుభవజ్ఞులైనడాక్టర్లు వున్నారని మంత్రి చెప్పారు. అయినా గ్రామీణప్రజలకు సక్రమ వైద్య సౌకర్యాలు ఎందుకు అందడంలేదని సభ్యులు ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతవై.ఎస్‌ రాజశేఖర రెడ్డితో పాటు 23 మంది సభాసభ్యులుడాక్టర్లు అయి వుండి కూడా రాష్ట్రంలో ప్రజలకుసరైన వైద్యం లభించకపోవడం సోచనీయమనిసభ్యులు అభిప్రాయ పడ్డారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X