వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రెనేడ్‌ పేల్చినమిలిటెంట్లు- ఒకరి మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: జమ్మూ కాశ్మీర్‌లోమిలిటెంట్లు విసిరిన గ్రెనేడ్‌ పేలి ఒక వ్యక్తి మరణించగా, 18 మంది గాయపడ్డారు.సెక్యూరిటీ క్యాంప్‌పై గురువారం మిలిటెంట్లు గ్రెనేడ్‌ పేల్చడానికి ప్రయత్నించారు. అయితే అది గురి తప్పి బటమలూబస్‌ స్టాండ్‌ వద్ద రద్దీగా ఉన్న రోడ్డుపై పడింది. ఈ సంఘటనలో ఒకరు మరణించగా, 18 మంది గాయపడ్డారు.

మొత్తం 19 మందిని ఆస్పత్రిలో చేర్పినట్లు, అయితే ఒకరు మృతి చెందినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. మరణించిన వ్యక్తిని అబ్దుల్‌ గనీ భట్‌గా గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందినఆర్‌.ఎం. బియా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ దాడికి పాల్పడింది తామేనని పాకిస్థాన్‌ అనుకూల తీవ్రవాద సంస్థ ఆల్‌-బర్గ్‌ చెప్పుకుంది. ఈ సంఘటనలో ముగ్గురు బిఎస్‌ఎఫ్‌ జవాన్లు కూడా గాయపడినట్లు సమాచారం. ఇయితే దీన్ని బిఎస్‌ఎఫ్‌ అధికార ప్రతినిధి ఖండిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X