వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణకాంత్‌ కు తెలుగునేల నివాళి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః గుండెపోటుతో కన్నుమూసిన ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్‌ కు ఆంధ్రప్రదేశ్‌అసెంబ్లీ ఘనంగా నివాళి అర్పించింది. ఆయన మృతికి సంతాపంగా శనివారం ప్రభుత్వ సెలవుదినం ప్రకటించారు. మూడురోజుల సాధారణ సంతాపదినాలుగా పాటిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణకాంత్‌ మృతికి అసెంబ్లీలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అన్ని రాజకీయ పార్టీలు ఘనంగా నివాళులు అర్పించాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపతీర్మానాన్ని ప్రవేశపెడుతూ విధి ఎంత నిర్దయగా వ్యవహరిస్తుందో కృష్ణకాంత్‌ హఠాన్మరణాన్ని చూస్తే అర్ధం అవుతుందన్నారు. గురువారం నాడు కలాం ఇంగ్లీషులో చేసిన ప్రసంగాన్ని ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్‌ హిందీలో జనరంజకంగా చదివి వినిపించారని ఇంతలోనే ఆయన గుండెపోటుతో మరణించడం బాధాకరమన్నారు.

వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ వివాదరహితుడిగా మంచిపేరుపొందిన కృష్ణకాంత్‌ హఠాన్మరణం దేశానికి,ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ కు తీరనిలోటన్నారు.సంపూర్ణ మద్యపాన నిషేధానికి ఆయన చేసినకృషి చిరస్మరణీయమని వై.ఎస్‌. నివాళులుఅర్పించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X