కొట్టాయంః కేరళలో శనివారం ఉదయం జరిగిన పడవప్రమాదంలో 30 మంది మరణించారు. 300 మందికి పైగా ప్రయాణిస్తున్న ఈ పడవ శనివారం తెల్లవారు జామున పతిరమనాల్ వద్ద మునిగిపోయింది.
చాలా మంది ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చారు. అయితే మృతుల సంఖ్య ఇంకాపెరిగే ప్రమాదం వున్నదని భావిస్తున్నారు. కేరళ పబ్లిక్సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసేందుకు వెళుతున్నవిద్యార్ధులు ఈ పడవలో పెద్ద సంఖ్యలో వున్నారు.