వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎనమిది మందినక్సలైట్ల లొంగుబాటు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు ఎనమండుగురు శనివారం పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డిజిపి)పేర్వారం రాములు ముందు లొంగిపోయారు. లొంగిపోయిన నక్సలైట్లలో ఇద్దరు కమాండర్లు, ఒక డిప్యూటీ కమాండర్‌ ఉన్నారు.

ఇద్దరు కమాండర్లలోపీపుల్స్‌వార్‌ అనుబంధ సాంస్కృతిక సంస్థ జన నాట్యమండలికి చెందిన కుసనపల్లి సారయ్య అలియాస్‌ చిట్టి, యు. మదనక్క అలియాస్‌ లత ఉన్నారు. సారయ్యపై రెండు లక్షల రూపాయల రివార్డు ఉంది. మదనక్కఒరిస్సా రాష్ట్రంలో చరుగ్గా పని చేసింది. ఆ రాష్ట్రంలో ఒక పోలీసు ఔట్‌పోస్టుపై దాడిలో కూడా ఆమె పాల్గొన్నది. ఆమెపై 20 వేల రూపాయల రివార్డు ఉంది.
పీపుల్స్‌వార్‌ సిద్ధాంతాలతో విసిగిపోయి, జన జీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితాన్నిగడపాలనే ఉద్దేశంతోవీరు లొంగిపోయినట్లు డిజిపి విలేకరులకు చెప్పారు.మిగతా వారు ఖమ్మం, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ వంటి తెలంగాణ జిల్లాల్లో పని చేశారు. అనారోగ్య కారణంగా తాము లొంగిపోతున్నట్లువీరు చెప్పారని పేర్వారం రాములు తెలిపారు.

లొంగిపోయిన నక్సలైట్లలో సింగాపూర్‌ దళం డిప్యూటీ కమాండర్‌ఎం. సత్యనారాయణ అలియాస్‌ కొమరన్న ఉన్నాడు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఇతను యాక్షన్‌టీమ్‌ సభ్యుడిగా పని చేశాడు. 1995లో నిర్మల్‌లో జరిగిన జిల్లా సహకార బ్యాంక్‌ చైర్మన్‌ రమేష్‌ రెడ్డి హత్య కేసులో ఇతను ఉన్నట్లు డిజిపి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X