వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేదరికం పోతేనే సంపూర్ణ అక్షరాస్యత

By Staff
|
Google Oneindia TeluguNews

ఖమ్మంః ఆంధ్రరాష్ట్రంలోపేదరికం నిర్మూలనతోనే సంపూర్ణ అక్షరాస్యత సాధ్యం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చదువుల పండుగలో భాగంగా శనివారం ఆయన ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రంలోపేదరిక నిర్మూలనకు మూడువేల కోట్ల రూపాయలతో వెలుగ పధకాన్ని ప్రారంభించినట్లు చంద్రబాబు తెలిపారు. అభివృద్ది కార్యక్రమాలు చేపడుతూనే సంపూర్ణ అక్షరాస్యత సాధన దిశగా ముందడుగు వేస్తున్నామని చంద్రబాబు అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కూడా చదువుల పండుగ కార్యక్రమం ఘనంగా జరుగుతున్నది. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ర్యాలీలు, బహిరంగ సభలు జరుగుతున్నాయి. పాఠశాలల్లో వేలాది మందివిద్యార్థులను చేర్చుతున్నారు. అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో బహిరంగ సభలు జరుగుతున్నాయి. మొత్తంమీద రాష్ట్రమంతటా తెలుగుదేశం నేతలహడావుడికి చదువుల పండగ వేదికగామారింది.బాలకార్మికుల్ని ప్రోత్సహిస్తే ఖబడ్దార్‌
నల్గొండః బాలకార్మికుల్ని ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చదువుల పండగ కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన కొండమల్లోపల్లిలో పర్యటించారు. అక్కడ వున్న బాలకార్మికుల పునరావాస శిబిరాన్ని సందర్శించారు. బాలకార్మికులకు చదువుకోవాల్సిందిగా హితవు చెప్పారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూఅక్షారాస్యతా వ్యాప్తికి తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X