వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రులకు బాబుక్లీన్‌ చిట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబయ్‌ః ఏక్‌ ఛోటిసిలవ్‌ స్టోరి సినిమా వ్యవహారం ఇప్పుడు కేంద్రప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళింది. సినీ నిర్మాత నాయర్‌, నటి మనిషా కొయిరాలాకు సమాచార, ప్రసార శాఖ నోటీసులు జారీ చేసింది. ఈవివాదాన్ని పరిష్కరించేందుకు శివసేన అధినేత బాల్‌ థాకరేవినాయక చవితి రోజున నాయర్‌, మనీషాతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశం నుంచి నాయర్‌ కోపంగా బయటకు వచ్చేయడంతో థాకరే ప్రయత్నాలు ఫలించలేదు.సెప్టెంబర్‌ 13న తమ ఎదుట హాజరై వివాదాస్పద సినిమాకు జారీ చేసినసెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ను ఎందుకు వెనక్కు తీసుకోరాదోవివరణ ఇవ్వాల్సిందిగా సమాచార, ప్రసార శాఖ నుంచి తనకు నోటీసుఅందిందని నాయర్‌ చెప్పారు.

ఈ సెన్సార్‌ సర్టిఫికెట్‌ ను ఎందుకు ఉపసంహరించుకోవాలో చెప్పాల్సిందిగా మనీషా కొయిరాలా తరపు న్యాయవాదికి కూడా నోటీసులుఅందాయి. దీనిపై కొయిరాలా ఈ నెల 13న ప్రసార శాఖ అధికారులను కలుసుకుంటారని ఆయనవివరించారు. కేంద్ర న్యాయశాఖతో సంప్రదించిన అనంతరం ప్రసారశాఖ అధికారులు ఇద్దరికీ నోటీసులు జారీ చేసినట్లు భావిస్తున్నారు. మనీషాఅందకు ముందు ప్రసారశాఖ మంత్రి షుష్మా స్వరాజ్‌ ను కలుసుకొనిసెన్సార్‌ సర్టిఫికెట్‌ ను వాపస్‌ తీసుకోవాల్సిందిగా కోరినవిషయం విదితమే.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X