మనీషాకు ప్రసారశాఖ నోటీసులు
ముంబయ్ః ఏక్ ఛోటిసిలవ్ స్టోరి సినిమా వ్యవహారం ఇప్పుడు కేంద్రప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళింది. సినీ నిర్మాత నాయర్, నటి మనిషా కొయిరాలాకు సమాచార, ప్రసార శాఖ నోటీసులు జారీ చేసింది. ఈవివాదాన్ని పరిష్కరించేందుకు శివసేన అధినేత బాల్ థాకరేవినాయక చవితి రోజున నాయర్, మనీషాతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశం నుంచి నాయర్ కోపంగా బయటకు వచ్చేయడంతో థాకరే ప్రయత్నాలు ఫలించలేదు.సెప్టెంబర్ 13న తమ ఎదుట హాజరై వివాదాస్పద సినిమాకు జారీ చేసినసెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ను ఎందుకు వెనక్కు తీసుకోరాదోవివరణ ఇవ్వాల్సిందిగా సమాచార, ప్రసార శాఖ నుంచి తనకు నోటీసుఅందిందని నాయర్ చెప్పారు.












Click it and Unblock the Notifications