వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెలుప్రమాదం మృతులు వందకుపైనే

By Staff
|
Google Oneindia TeluguNews

రఫిగంజ్‌(బీహార్‌)ః బీహార్‌ లో ఆదివారం రాత్రి జరిగినఘోర రైలు ప్రమాదం మృతుల సంఖ్య వందకుపైగానే వుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం ఉదయం వరకు 80 మృతదేహాలను కనుగొన్నారు. ఒక బోగీలోని ప్రయాణికుల విధివిలాసం ఇంకా తెలియడం లేదు. ఆ బోగీని కోసి మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ బోగీలోని వారెవరూ బతికే అవకాశాలు లేవు. దీంతో మృతుల సంఖ్య వందకుపైగానే వుండే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

ఈ ప్రమాదానికివిద్రోహక చర్యే కారణం అని రైల్వే అధికారులు బల్లగుద్దిచెబుతున్నారు. మరో వైపు పాట్నా పోలీసులు రైల్వే అధికారులపై ఛార్జిషీటు దాఖలు చేశారు. ట్రాక్‌ సరిగా లేకపోవడం, బ్రిడ్జికి కాలం చెల్లిపోవడమే ప్రమాదానికి కారణం అనేది వారి అభిప్రాయం. సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X