వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదానికి మూలం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌: పిఎం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌: ఉగ్రవాదుల స్థావరాలను, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయనంత వరకు ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలోవిజయం సాధించలేమని ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి అన్నారు. యూదు సంఘాల సమావేశంలో ఆయన ఈ విధంగా అన్నారు.

అమెరికా అధ్యక్షుడు బుష్‌తో సమావేశమైనప్పుడు కూడా ఈవిషయమే చెప్పినట్లు ఆయన తెలిపారు. అమెరికాతో భారత్‌ కోరుకుంటున్న ద్వైపాక్షిక సంబంధాలను, ఉత్తమ సహకారాన్నిఉగ్రవాదం హైజాక్‌ చేయకుండా చూడాలని తాను బుష్‌తో అన్నట్లు వాజ్‌పేయి తెలిపారు. ప్రజాస్వామికవిలువలను ధ్వంసం చేయడమే ఉగ్రవాద లక్ష్యమని, ఇప్పుడు ఉగ్రవాద వ్యతిరేక పోరులో భారత్‌తో అమెరికా కలిసిందని ఆయన అన్నారు.

వాణిజ్యాభివృద్ధి, ఆర్థికావకాశాల పెంపు విదేశీ విధానంలో కీలక పాత్ర వహిస్తాయని, యశ్వంత్‌సిన్హా ఈ అవకాశాన్ని వాడుకోగలరని , వాణిజ్యానికి ఉన్న అడ్డంకులను తొలగించడానికి సిన్హా తన దౌత్యనేర్పును వాడుకోగలరని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X