వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధాని ప్రమాదం వెనక కుట్ర లేదు

By Staff
|
Google Oneindia TeluguNews

పాట్నా: రాజధానిఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం వెనుక కుట్ర ఉన్నదనే ఆరోపణలను ఔరంగాబాద్‌ పోలీసు సూపరింటిండెంట్‌, జిల్లా మెజిస్ట్రేట్‌ త్రోసిపుచ్చారు. ఈవిషయాన్ని రైల్వే వర్గాలు వెల్లడించాయి. 119 మందిని బలిగొన్న ఈ ప్రమాదం వెనుక కుట్ర ఉన్నదనిరైల్వే మంత్రి నితీష్‌కుమార్‌, సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రకటించినవిషయం తెలిసిందే.

బీహార్‌ హోం కమీషనర్‌ యు.ఎన్‌. పంజీర్‌కు పంపిన నివేదికలో ప్రమాద కారణాన్ని,స్వభావాన్ని, జిల్లా అధికారయంత్రాంగం చేపట్టిన సహాయ చర్యలను వెల్లడించినట్లు మగధ రేంజ్‌ డివిజనల్‌కమీషనర్‌ హెచ్‌. సి. శిరోహి ఫోన్‌లో పిటిఐ వార్తా సంస్థకు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలతో సమగ్ర నివేదికనుఅందించాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ఆ అధికారుల నుంచి బీహార్‌ ప్రభుత్వం సంయుక్త నివేదికను కోరింది.

రైల్వే మంత్రులు చేసిన ప్రకటనతో రాష్ట్రీయ జనతాదళ్‌ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌యాదవ్‌ విభేదించారు.రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల, ట్రాక్‌ను, వంతెనను సరిగా నిర్వహించకపోవడం వల్ల ప్రమాదం సంభవించిందని ఆయన అన్నారు.

ఫిష్‌ప్లేట్లు తొలగించారనే రైల్వే అధికారుల వాదనను ఔరంగాబాద్‌ జిల్లా మెజిస్ట్రేట్‌ ఎస్‌. సిధార్థ్‌, పోలీసు సూపరింటిండెంట్‌ ఎస్‌.కె. ఝా త్రోసిపుచ్చారు. రాజధానిఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంపై వీరు రెండు పేజీల నివేదికను సమర్పించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X