వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిమజ్జనానికిభారీ బందోబస్త్‌!

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: 11 రోజుల పాటు భక్తులతో వేడుకలు స్వీకరించిన బొజ్జగణపయ్య శుక్రవారం నిమజ్జనానికి సిద్దమవుతున్నాడు. ఈ సారి హైదరాబాద్‌ లో సామూహిక నిమజ్జనం రోజు శుక్రవారం కావడంతో నగర పోలీసులు భారీ బందోబస్త్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. నిమజ్జనం రోజు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్దమొత్తంలో పోలీసుల బలగాలను వినియోగించుకుంటున్నారు. 21 వేల మంది పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఏడాది నగరంలో 11వేల వినాయకుడి మండపాలను ఏర్పాటు చేశారు.

ఇందులో చిన్న, చిన్న మండపాలు మంగళవారం నుంచే వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నారు. అయితే, నగరంలో కీలకమైన అతిపెద్దదిగా పేరుపొందిన బాలాపూర్‌ వినాయకుడి ఊరేగింపు పాతబస్తీ నుంచి మొదలవుతుంది. ఈ బాలపూర్‌ వినాయకుడిని మధ్యాహ్నం 12గంటలకే నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ముస్లిం సోదరులు చిన్న, చిన్న మసీదులలో గానీ, ఇంట్లోనే నమాజ్‌ చేసుకోవాలని మజ్లిస్‌ పార్టీలుకోరాయి.

వినాయకుడి ఊరేగింపు ప్రశాంతంగా సాగేందుకు ఈ సారి ముస్లిం పార్టీలన్ని స్వచ్చందంగా ముందుకు రావడం విశేషం. అలాగే హైదారాబాద్‌ లోని ఖైరాతాబాద్‌ లోని అతిపెద్ద వినాయకుడి ఊరేగింపు కోసం ట్రాలీని ఈసారి రాష్ట్రప్రభుత్వమే సమకూరుస్తుండడం విశేషం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X