వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌ మందుపాతరకు ముగ్గురుబలి

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురంః అనంతపురం జిల్లాలో నక్సలైట్లు మందుపాతరపేల్చి ముగ్గురిని బలిగొన్నారు. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం దూపంపల్లి అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం నక్సలైట్లు మందుపాతరపేల్చారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు ఎక్సైజ్‌ పోలీసులు, జీపు డ్రైవర్‌ దుర్మరణం పాలయ్యారు. మందుపాతరపేల్చిన వెంటనే జీపులో వున్న మిగిలిన పోలీసులపై నక్సలైట్లు కాల్పులు ప్రారంభించారు. దీంతో జీపులో ప్రయాణిస్తున్నమిగిలిన పోలీసులు పప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు.

బుధవారం నాడు కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో మండలాధ్యక్షుడితో సహా ముగ్గురిని హతమార్చిన నక్సలైట్లు మరుసటి రోజే అనంతపురం జిల్లాలోవిరుచుకు పడ్డారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తంఅయింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X