వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వార్‌ హింసను వీడాలి: దేవేందర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హింసాత్మక చర్యలను వీడి చర్చల ద్వారాశాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని హోంమంత్రి దేవందర్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. కర్నూలు, అనంతపురంలో వార్‌ చేపట్టిన విధ్వంసక చర్యల నేపథ్యంలో ఆయన స్పందించారు. అమాయకులను పొట్టనబెట్టుకోవడం ద్వారా ప్రజల దృష్టిలో వార్‌ మరింత చులకనఅయిందని దేవేందర్‌ గౌడ్‌ గురువారం హైదరాబాద్‌ లో అన్నారు.

తొలిసారిగా దేవేందర్‌ గౌడ్‌ వార్‌ తో చర్చలువిఫలమయ్యాని అంగీకరించాడు. ఇప్పటివరకు ప్రభుత్వం వార్‌ తో జరిపిన చర్చలు ఆగిపోయాయని మాత్రమే ప్రకటిస్తూ వచ్చింది. అవివిఫలమయ్యాయని అధికారికంగా ప్రకటించలేదు. అయితే, చర్చల ద్వారానేశాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని ఆయన మరోసారి స్పస్టంచేశారు. చర్చలకు ఇప్పటకీ సిద్దమని దేవేందర్‌ గౌడ్‌ మళ్ళీ ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటకీ చర్చలకు సిద్దంగా ఉంది. హింసను రూపుమాపాలనేదే మా ప్రభుత్వ ధ్యేయం. అందుకే రాష్ట్రంలో నక్సలిజానికి శాశ్వత పరిష్కారానికై మేం కృషిచేస్తున్నాం. అని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X