వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వై.ఎస్‌. ధర్నా - బాబు ఫోన్‌ తోవిరమణ

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురంః కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ నాయకుడు రైతు సమస్యలపై గురువారం ఉదయం అనంతపురంలో ధర్నా ప్రారంభించారు. అనావృష్టితో బాధపడుతున్న రైతుల సమస్యలను అంతకు ముందు ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకొనేందుకు కనీసం విత్తనాలు లేని దుస్థితి వున్నదని రైతులు వై.ఎస్‌. కు మొరపెట్టుకున్నారు. దీంతో వై.ఎస్‌. గురువారం మధ్యాహ్నం అనంతపురంలోని వ్యవసాయం కార్యాలయం వద్ద ధర్నా ప్రారంభించారు.

తెలుగుదేశం ప్రభుత్వం రైతుల ఉసురుపోసుకుంటున్నదని ఆయన ధర్నా సందర్భంగావిమర్శించారు. రాయలసీమలో శంఖుస్థాపనలే తప్ప ప్రాజెక్టులు మాత్రం రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యామ్నాయ పంటలకు రైతులకు విత్తనాలు సరఫరా చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిందని చంద్రబాబు నాయుడు ధర్నా చేస్తున్న వై.ఎస్‌. కు ఫోన్‌ చేసి చెప్పారు. ఈవిషయాన్ని వై.ఎస్‌. ధర్నా వద్ద గుమికూడిన వారికి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. రైతులకు విత్తనాలు ఇచ్చేందుక ప్రభుత్వం అంగీకరించడంతో వై.ఎస్‌. ధర్నావిరమించుకున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X