వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పది క్రికెట్‌టీమ్‌లపై గట్టి నిఘా

By Staff
|
Google Oneindia TeluguNews

కొలంబో: బుకీల నుంచి, వేశ్యల నుంచి, తదితరుల నుంచి ఐసిసి ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొంటున్న క్రికెటర్లను దూరంగా ఉంచేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. పది దేశాలకు చెందిన క్రికెటర్ల గదులకుస్త్రీలను దూరంగా వుంచేందుకు తాము యుద్ధమే చేయాల్సి వస్తోందని పోలీసులంటున్నారు. కొందరు క్రికెటర్లు పోలీసులు కళ్లు గప్పుతున్న వైనాలున్నాయి.వెస్టిండీస్‌ మేనేజర్‌ రికీస్కెరిట్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ గారిఫీల్డ్‌ స్మిత్‌ గదుల్లో ముగ్గురు మహిళలు ఉన్నవిషయాన్ని తాము అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి)కి తెలియజేసినట్లు పోలీసులు ఆదివారం నాడు చెప్పారు.తాము నైతికమైన తీర్పు ఇవ్వడం లేదని, క్రికెట్‌ అధికార యంత్రాంగం యాక్సెస్‌ కంట్రోల్‌ మార్గదర్శక సూత్రాలను అమలు చేయడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నామని వారు చెప్పారు. వెస్టిండీస్‌ క్రికెటర్ల కంపెనీలో ఉన్న ఒకస్త్రీ శ్రీలంక మాజీ పోలీసు ఛీఫ్‌ కూతురు కాగా, మరొకరు 17 ఏళ్లవిద్యార్థిని. వెస్టిండియన్ల అనుమతితోనే వారు ఆ గదిలో ఉన్నారని, అయితే బుకీలతో ఆ మహిళలకు ఏమైనా సంబంధాలున్నాయా అనేవిషయాన్ని ఆరా తీస్తున్నామని సంబంధిత వర్గాలు చెప్పాయి.క్రీడాకారులు బస చేస్తున్న తాజ్‌ సముద్రలో 300 మంది మఫ్టీ పోలీసులనుపెట్టారు. దీనికి తోడు యూనిఫామ్‌ పోలీసులున్నారు. మ్యాచ్‌ జరుగుతున్న స్థలాల్లో, హోటల్లో క్రీడాకారులు మొబైల్‌ఫోనును వాడడాన్ని నిషేధించారు. క్రీడాకారుల కారు పార్క్‌ గ్రాండ్‌స్టాండ్‌ వద్దనే కాకుండా నెట్‌ ప్రాక్టీస్‌ చోట్ల కూడా గట్టి నిఘాపెట్టారు. హోటల్‌ స్టాఫ్‌కు బుకీలతో ఏమైనా సంబంధాలున్నాయాఅనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X