తప్పించుకున్న ముగ్గురుమిలిటెంట్లు

శ్రీనగర్‌: శ్రీనగర్‌లోని గోగ్జీబాగ్‌లో భారత భద్రతా బలగాలతో ఎదురుకాల్పుల్లో పాల్గొన్న నలుగురిలో ముగ్గురుమిలిటెంట్లు తమ స్థావరాలకు చేరుకున్నారని పాకిస్థాన్‌ అనుకూల జమైత్‌- ఉల్‌- ముజాహిదీన్‌ మంగళవారంనాడు ప్రకటించింది.

భద్రతా బలగాలతో రాత్రంతా ఎదురుకాల్పుల్లో పాల్గొని స్థావరాలకు చేరుకున్నమిలిటెంట్లు తమకు అందుబాటులోకి వచ్చారని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఎన్‌ఎఎఫ్‌ఎ న్యూస్‌ ఏజెన్సీకి తెలియజేశాడు. నలుగురుమిలిటెంట్లలో ఒకరు గ్రూప్‌ నుంచి విడిపోయాడని, అతను ఎన్‌కౌంటర్‌లో మరణించి ఉంటాడని అతను అన్నాడు.

భారత భద్రతా బలగాలతో ఎదురు కాల్పుల్లో పాల్గొంటున్నవారిలో ఇద్దరు పాకిస్థానీలతో పాటు నలుగురు తమ కార్యకర్తలున్నట్లు ఈ సంస్థ అధికార ప్రతినిధి అంతకు ముందు ప్రకటించాడు. వారిని మునీర్‌ అహ్మద్‌, మొహమ్మద్‌ అష్రాఫ్‌, పాకిస్థానీ సహచరులు వజహత్‌- ఉల్లా,ఇబ్రాహిమ్‌లుగా గుర్తించినట్లు అతను తెలిపాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+