వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం పదవిని ఆశిస్తున్న పిడిపి

By Staff
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణం ఏర్పాటుకు ఏర్పాటుకుఅంగీకరించిన పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పిడిపి) కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తోంది. తమ నాయకుడు ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌కు ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు అవకాశం కల్పించాలని అడుగుతోంది.

కాశ్మీర్‌ లోయకు చెందిన నేత ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని,అందుకు సయీద్‌ అయితే బాగుంటుందని పిడిపి ఉపాధ్యక్షుడు ముజఫర్‌ బేగ్‌ గురువారం అన్నారు. కాంగ్రెస్‌, పిడిపిల సంకీర్ణం బాగుంటుందని, ఇందుకు తగిన నేపథ్యం కూడా ఉన్నదని ఆయన అన్నారు.

సంప్రదింపుల ద్వారా ముఖ్యమంత్రి పదవి విషయంలో ఒక నిర్ణయానికి వస్తామని ఆయన అన్నారు. జమ్మూ ప్రొవిన్స్‌లో కాంగ్రెస్‌కు మెజారిటీ లభిస్తుందని,అందువల్ల ఆ ప్రాంతానికి చెందిన నేత ముఖ్యమంత్రి కావాలనే డిమాండ్‌ ఉంటుందని ఆయన అన్నారు. అయితే కాశ్మీర్‌ లోయ ప్రజల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోసుకోవాలనేవిషయం మర్చిపోకూడదని, ఇక్కడ నేత ముఖ్యమంత్రి అయితేమిలిటెంట్లతో చర్చలకు సంబంధాలు ఏర్పడతాయని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X