వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగిసిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌

By Staff
|
Google Oneindia TeluguNews

కోల్‌కత్తా: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 358 పరుగులకు ఆలౌట్‌ అయింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసిన భారత్‌ రెండో రోజు గురువారం మరో 83 పరుగులు మాత్రమే జోడించింది.

మొదటి రోజు బుధవారం వి.వి.యస్‌. లక్ష్మణ్‌ అర్థ సెంచరీ మిస్‌ కాగా గురువారం రెండో రోజు పార్థీవ్‌ పటేల్‌తో పాటు జువగళ్‌ శ్రీనాథ్‌ కూడా అర్థ సెంచరీలు మిస్‌ అయ్యారు. పార్థీవ్‌ పటేల్‌ 47 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లాసన్‌ బౌలింగ్‌లో చంద్రపాల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ దారి పట్టాడు. శ్రీనాథ్‌ దూకుడుగా ఆడి స్కోరును పరిగెత్తించాడు. శ్రీనాథ్‌ 46 పరుగులు చేసి డిల్లాన్‌ బౌలింగ్‌లో హూపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

మొదటి రెండు టెస్టు మ్యాచ్‌ల్లోనూ ఘోరంగా విఫలమైన వెస్టిండీస్‌ ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగలిగింది. డిల్లాన్‌ మూడు వికెట్లు తీసుకోగా, కఫీ, లాసన్‌, పావెల్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. హూపర్‌కు ఒక వికెట్‌ లభించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X