వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రహస్య అణు కార్యక్రమాలకు బ్రేక్‌: పిఎం

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: అణ్వాయుధాలను రహస్యంగా తయారు చేయడాన్ని, అణు సాంకేతిక విజ్ఞానాన్ని దొంగచాటుగా చేరవేయడాన్ని అడ్డుకోవాలని ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి పిలుపునిచ్చారు.

తమ అణు కార్యక్రమాలపై అపోహలను విడనాడాలని ఆయన అభివృద్ధి చెందిన దేశాలను కోరారు. బాబా అణు పరిశోధనా సంస్థలో వివిధ సౌకర్యాలను ఆయన గురువారం ప్రారంభించారు. భారతదేశంలోని అణు ఇంధన కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని ఆయన ఆయన విదేశాలను కోరారు. 2020 నాటికి 20 వేల మెగావాట్ల అణు ఇంధనాన్ని తయారు చేయాలనేది భారత లక్ష్యమని, అణుఇంధన వాతావరణానికి అనుకూలమైనదని ఆయన అన్నారు.

ప్రతి భారత అణుఇంధన సహకార ప్రాజెక్టు అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణంగానే ఉన్నదని ఆయన చెప్పారు. భారత్‌ 1998లో అణు పరీక్షలు నిర్వహించడానికి గల కారణాలేమిటో అందరికీ తెలుసునని ఆయన అన్నారు. దేశ అణు శాస్త్రవేత్తలను ఆయన ప్రశంసించారు. భారత అణ్వాయుధాలన్నీ సొంత పరిజ్ఞానంతో తయారైనవేనని, వీటి తయారీలో అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించలేదని ఆయన చెప్పారు. నూతన అన్వేషణలకు, పరిశోధనలకు ప్రాధాన్యం ఇచ్చి భారత అణు ఇంధన కార్యక్రమాలను అభివృద్ధికర దిశగా నడిపించాలని ఆయన శాస్త్రవేత్తలను కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X