వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరువు జాబితాలో కరెంట్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తాజాగా కరువు జాబితాలో కరెంట్‌ కూడా చేరింది. ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు అధికంగా కరెంట్‌ను వాడుకున్నారని, దీని వల్ల ప్రభుత్వంపై 500 కోట్ల అదనపు భారం పడిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు.

కరెంట్‌ అదనపు భారంతో కలుపుకొని రాష్ట్రానికి కరువు సహాయం అందించాలని ఆయన రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఉప ప్రధాని ఎల్‌.కె. అద్వానీని కోరారు. కరువు వివరాలను ముఖ్యమంత్రి ఉప ప్రధానికి అందజేస్తూ రాష్ట్రానికి వెంటనే సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయికి విన్నవిస్తానని అద్వానీ చెప్పారు. కరెంట్‌ భారంతో కలిపి ప్రతిపాదనలు చేసి కేంద్రానికి పంపుతామని చంద్రబాబు తెలిపారు.

కరువు వల్ల రైతులకు సరఫరా చేస్తున్న కరెంట్‌పై ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ మరింత పెరిగే అవకాశం ఉన్నదని ఆయన అన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల విద్యుదుత్పత్పి పడిపోతోందని, వినియోగం పెరుగుతోందని ఆయన చెప్పారు. రైతుల రుణాలపై వడ్డీని మాఫీ చేయాలని, రుణాలను రీషెడ్యూల్‌ చేయాలని ఆయన అద్వానీని కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X