వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుపి రెబెల్స్‌కు వెంకయ్య హెచ్చరిక

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని పార్టీ తిరుగుబాటు శాసనసభ్యులను భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడు తీవ్రంగా హెచ్చరించారు. వ్యక్తిగత పట్టింపుల కన్నా పార్టీ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, శాసనసభ్యుల ప్రవర్తన పార్టీ ప్రతిష్టను దెబ్బ తీయరాదని ఆయన అన్నారు.

బిజెపి అంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుల సమావేశంలో ఆయన గురువారం ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్‌ పరిణామాలు పార్టీకి అంత మంచివి కావని, ఈ విధమైన పరిణామాలు పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బ తీస్తాయని ఆయన అన్నారు. ఇటువంటి క్రమశిక్షణారాహిత్యాన్ని పార్టీ సహించబోదని ఆయన అన్నారు. విభేదాలేమైనా ఉంటే శాసనసభ్యులు పార్టీ వేదిక మీద వ్యక్తం చేయాలని, నాయకత్వాన్ని ప్రజాప్రతినిధులు బహిరంగంగా సవాల్‌ చేయడం సమంజసం కాదని వెంకయ్యనాయుడు అన్నారు.

పార్టీ వ్యక్తుల కన్నా గొప్పదని, అందువల్ల పార్టీ పంథాకు అనుగుణంగా మనం మారాలని ఆయన కౌన్సిల్‌ సభ్యులతో అన్నారు. ఇప్పటికైనా ఉత్తరప్రదేశ్‌లోని తిరుగుబాటు
శాసనసభ్యులు తమ తప్పును గ్రహించి క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి యుపి తిరుగుబాటుదారులు పార్టీ పంథాకు అనుగుణంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X