ముగిసిన అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: 31 రోజుల పాటు సాగినఅసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారంతో ముగిశాయి. ఈ సారి సమావేశాల్లో 220 గంటల పాటు చర్చలు జరిగినప్పటికీ సగం సభా సమయం వృధాఅయిందనే వాదన ఉంది. దీనికి కారణం ప్రతిపక్షాల వైఖరి అని తెలుగుదేశం ప్రభుత్వం విమర్శిస్తుండగా, ప్రభుత్వానికి శాసనసభ, సభ్యులపై గౌరవం లేనట్లు కన్పిస్తోందని ప్రతికపక్షాలు ఆరోపించాయి.
ఈ సారి కరువు, ఫ్లోరోసిస్ సమస్య, ఐఎఎస్ అధికారుల రభస,విద్యుత్ ప్రాజెక్ట్ లు ప్రధానంగా చర్చకు రాగా, ప్రభుత్వం పలు సందర్భాల్లో ఇరుకున పడింది. అయితే, తాము ప్రవేశపెట్టిన 15 వాయిదా తీర్మానాలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్విమర్శించింది.
సీపీఎం కూడా కాంగ్రెస్ వంతపాడింది. తెలుగుదేశం మిత్రపక్షమైన బీజేపీ కూడా ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎప్పటిలాగే మంత్రులు చర్చల సందర్భంగా ముందస్తు సమాచారం లేకుండా, ఏ మాత్రం ప్రిపేర్ అవకుండా చర్చకు సమాధానం ఇవ్వకుండా సమస్యలను పక్కదారి పట్టేలా ప్రవర్తించారని బీజేఎల్పీ నేత ఇంద్రాసేనారెడ్డి సోమవారంవిలేకరులతో అన్నారు. బీజేపీ ఈ సమావేశాల్లోఅయిదు వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టింది.