ఎ.కె. ఎన్ కౌంటర్ పై అనుమానాలు
కరీంనగర్: పీపుల్స్ వార్ అగ్రనేతఅనుపురం కొమురయ్య (ఎ.కె) అలియాస్ సుధాకర్ మృతిపై స్థానిక ప్రజలు పోలీసుల హత్యగా అభివర్ణిస్తున్నారు.దాదాపు 20 ఏళ్లుగా వార్ లో పనిచేస్తూ ఉన్నతస్థాయికిఎదిగిన ఎ.కె. పై 10 లక్షల రివార్డు ఉంది. గాలింపుచర్యల్లో భాగంగా శుక్రవారం జరిగిన ఎన్ కౌంటర్లో ఎ.కె. మరణించినట్లు పోలీసులు చెపుతున్నారు. కానీ ఎన్ కౌంటర్ జరిగినప్రదేశానికి దగ్గర్లోని ఖాన్ సాయి పేట గ్రామస్థులు మాత్రం ఎటువంటిఎదురుకాల్పులు జరిగిన శబ్దం రాలేదని అంటున్నారు. కరీంనగర్ జిల్లాహుజురాబాద్ మండలం దండేపల్లికిచెందిన ఎ.కె. వార్ లో కీలక నేత. కరీంనగర్ పోలీసులువిలేకరులకు తెలిపిన సమాచారం ప్రకారంసి.ఐ.సురేందర్ రెడ్డి నేతృత్వంలోని గాలింపుబృందం శుక్రవారం రాత్రి మంథని అడవుల్లో గాలింపుచేపట్టారు.
రాత్రి 11 గంటల ప్రాంతంలోపోలీసులపై ఉన్నట్టుండి తుపాకీ గుళ్ళ వర్షంకురిసింది. వెంటనే పోలీసులు అలెర్ట్ అయి ప్రతిగా కాల్పులుజరిపారు. దాదాపు గంటసేపు ఈ ఎన్ కౌంటర్ సాగింది. అనంతరం శనివారంఉదయం పోలీసులు అక్కడికి రాగా ఒక శవం లభించింది. అది ఏ.కె.గావారు గుర్తించారు. ఓ 30 ఎంఎం కార్బన్ తో పాటు అన్నంమూట, ఇతర సామాగ్రి అక్కడ లభించినట్లు పోలీసులువిలేకరులతో అన్నారు. మరో పది మంది దళసభ్యులు అక్కడినుంచి తప్పించుకొని పారిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నాయి. అయితే, పోలీసులు గంటసేపు భారీఎదురుకాల్పలు జరిపామని చెపుతున్నప్పటికీ,పక్కనే ఉన్న గ్రామంలోని వారెవరూ ఎటువంటి శబ్దాలురాలేదని ఖచ్చితంగా చెప్పుతున్నారు.