కెసిఆర్ సైకిల్ యాత్ర ప్రారంభం
మెదక్: తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిరెండేళ్ళు పూర్తయిన సందర్భాన్ని పురష్కరించుకొని ఆ పార్టీ అధినేత జైత్రయాత్రను శనివారంమెదక్ జిల్లాల్లో ప్రారంభించారు. ఆదివారం నాడువరంగల్ లో జరగనున్న బహిరంగసభలోపాల్గొనేందుకు ఆయన మెదక్ నుంచి సైకిల్ యాత్రను ప్రారంభించారు. శనివారం నాడుదాదాపు 28 కిలోమీటర్ల మేరకు సైకిల్ పై ప్రయాణంచేశారు. వందలాది కార్యకర్తలు ఈ యాత్రలోపాల్గొన్నారు. అడుగడుగునా కె.సి.ఆర్ కు గ్రామీణు మహిళలు హారతలుపట్టారు. ఆయన యాత్రకు ప్రజల నుంచి చక్కటిస్పందన వచ్చింది. ఈ సందర్భంగా ఆయనతెలుగుదేశం, కాంగ్రెస్ లపై విరుచుకుపడ్డారు.
తెలంగాణ వెనుకబాటు తనానికి ఈ రెండు పార్టీలే కారణమనిఅన్నారు. ముఖ్యంగా వై.ఎస్. తన పాదయాత్రసందర్భంగా తె.రా.సపై విరుచుకపడడాన్ని ఆయనఎద్దేవ చేశారు. తాను చిటికేస్తే వై.ఎస్పాదయాత్ర ఆగిపోతుందన్నారు. కాంగ్రెస్ చేసినఅన్యాయానికి తోడు తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యంవల్లే పెండింగ్ ప్రాజెక్ట్ లు పెండింగ్ ప్రాజెక్ట్లగానే ఉండిపోతున్నాయన్నారు. ఆదివారం నాడు జరగనున్నవరంగల్ సభతో తెలంగాణ రాష్ట్ర సమితి పవర్ఏమిటో తెలుస్తుందన్నారు. ఈ సభకు మాజీ ప్రధాని దేవగౌడతోపాటు, అజిత్ సింగ్ తదితరులు హాజరు కానున్నారనిచెప్పారు.












Click it and Unblock the Notifications