వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమలలో స్థానికుల తరలింపు, ఉద్రిక్తత

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుపతి: తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానం తన మాస్టర్‌ ప్లాన్‌ లో భాగంగా శనివారం చేపట్టిన స్థానికుల తరలింపు కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల లాఠీ ఛార్జీ,అరెస్ట్‌ ల పర్వంతో ఆ ప్రాంతం అంతా రెండు గంటల పాటు ఉద్రిక్తంగా మారింది. స్థానికులకు, పోలీసులకు మధ్య రెండు గంటల పాటు తీవ్ర వాగ్యుద్దం జరిగింది.

అనంతరం పోలీసులు లాఠీఛార్జీ జరిపారు. పిల్లలు, మహిళలు అని చూడకుండా పోలీసులు చితకబాదారు.పలువురినిఅరెస్ట్‌ చేశారు. తర్వాత టి.టి.డి అధికారులు నివాస గృహాలనుస్వాధీనం చేసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది మాత్రమే ఇక్కడ ఉండాలంటూ టిటిడి చేపట్టిన మాస్టర్‌ ప్లాన్‌ ఏళ్లతరబడి కోర్టులో నానుతోంది.

స్థానికుల తరలింపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌,సీపీఎంల అధ్వర్యంలో ధర్నాను చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకొని లాఠీఛార్జీ జరిపి, అఖిలపక్ష సభ్యులనుఅరెస్ట్‌ చేశారు. ముందస్తూ నోటీసు లేకుండా స్థానికులను తరలించడంపై అఖిలపక్ష సభ్యులు మండిపడ్డారు. తిరుపతిలో ప్రత్యేక స్థలాలను కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పిటికీ, అధికారుల నివాసగృహాలనుస్వాధీనం చేసుకోవడం మినహా వసతి కల్పనపై దృష్టి సారించలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X