మిలిటెంట్ల దాడి- వైష్ణోదేవి భక్తులు బలి
జమ్ము: జమ్ములో వైష్ణోదేవి యాత్రికులపై సోమవారం రాత్రిమిలిటెంట్లు శక్తివంతమైన బాంబులతో దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు భక్తులు మరణించారు. మరణించినవారిలో నాలుగేళ్ల పసిపాప కూడా ఉంది. మరో 42 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే దారిలో ఈ దాడి జరిగింది.
ఉమ్మడి వంటశాలలో రాత్రి పదకొండుంబావు ప్రాంతంలో భక్తులు భోజనాల గుమికూడిన ఉన్న సమయంలోమిలిటెంట్లు గ్రెనేడ్లతో దాడి చేశారు. భోజనాలు చేసి ఆలయానికి తిరిగి వెళ్తున్న భక్తులపై వంటశాల సమీపంలో మరో పదినిమిషాల తర్వాత మరోసారి గ్రెనేడ్లువిసిరారు. ఈ సంఘటనల్లో ఏడుగురు మరణించినట్లు, 42 మంది గాయపడినట్లు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ మంత్రి జుగల్ కిశోర్విలేకరులకు చెప్పారు. మరణించినవారలో పంజాబ్కు చెందిన దల్జీత్ సింగ్ (35), హర్పీత్ సింగ్ (20), నాలుగేళ్ల కుల్వీర్ సింగ్ ఉన్నారు. భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు.
ఈ దాడుల వెనుక పాకిస్థాన్ ఇంటలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ లేదా పాకిస్థాన్ ప్రేరేపిత లష్కర్- ఎ- తోయిబా వుండవచ్చునని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చిన్మయానంద్ అన్నారు. మత కల్లోలాలను సృష్టించడానికి ఈ దాడులను ఉద్దేశించి ఉంటారని ఆయన అన్నారు. భారత, పాకిస్థాన్ల మధ్య సంబంధాలు మెరుగుపడే దశలో ఇటువంటి సంఘటనలు జరగడం పరిపాటిఅయిందని ఆయన వ్యాఖ్యానించారు. భారత, పాక్ల మధ్య శాంతి ప్రక్రియనుదెబ్బ తీయడానికే ఈ దాడులు జరిగాయని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ అన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చిన్మయానంద్ మంగళవారం ఉదయం జమ్మూ కాశ్మీర్కు వచ్చారు.