వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆజాద్‌తోనే అసమ్మతి అమీతుమీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని పాతబస్తీలో గల కిషన్‌బాగ్‌లో నరబలి జరిగినట్లు అనుమానిస్తున్నారు. కుల్సుంపురా పోలీసుస్టేషన్‌ పరిధిలోని కిషన్‌బాగ్‌లో ఆరేళ్ల శ్రీధర్‌ను అదృశ్యశక్తులను సంతృప్తి పరచడానికి బలి ఇచ్చినట్లు ఆ బాలుడి తండ్రి చెంచయ్య ఆరోపిస్తున్నాడు.

వివరాలు ఇలా ఉన్నాయి- తాపీ మేస్త్రీగా పని చేస్తున్న చెంచయ్య కుమారుడు శ్రీధర్‌ ఆదివారం నాటి నుంచి కనిపించడం లేదు. దాంతో చెంచయ్య దంపతులు కొడుకు కోసం వెతకడం ప్రారంభించారు. ఎట్టకేలకు సోమవారం ఉదయం వారికి తమ కుమారుడు శ్యాం అనే వ్యక్తి ఇంటి వద్ద తొట్టిలో శవమై కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని శ్యాంను అరెస్టు చేశారు. శ్యాం చెంచయ్య వద్ద పని చేసేవాడు. చెంచయ్య సరిగా కూలీ ఇచ్చేవాడు కాదని శ్యామ్‌ కోపంగా ఉన్నట్లు పోలీసులు గమనించారు. తాగి ఉన్న మైకంలో ఏమీ తెలియని స్థితిలో బాలుడ్ని చంపానని శ్యామ్‌ అంగీకరించినట్లు చెబుతున్నారు. అయితే అతీంద్రియ శక్తుల కోసమే తన కుమారుడిని బలి ఇచ్చారని చెంచయ్య గట్టిగా చెబుతున్నాడు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X