వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీటి ప్రాజెక్టులపై కేంద్రం హామీ: వైఎస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో పెండింగ్‌నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు సమకూరుస్తామనికేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి చెప్పారు. రాష్ట్రానికి చెందిన వివిధప్రాజెక్టులపై కేంద్రమంత్రులతో చర్చించడానికి ఢిల్లీ వెళ్ళినరాజశేఖరరెడ్డి గురువారం ఉదయం హైదరాబాద్‌కుతిరిగివచ్చారు. ఆరు భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, నాలుగుమధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణం కేంద్రరాష్ట్ర ప్రభుత్వఅధికారులతో కమిటీ నియమించడానికి నిర్ణయం తీసుకున్నట్టుఆయన చెప్పారు.

గత తెలుగుదేశ ప్రభుత్వంనీటిపారుదల రంగాన్ని అలక్ష్యం చేసిన కారణంగా కేంద్రం ఈరంగానికి తక్కువ నిధులు కేటాయించిందని ముఖ్యమంత్రిచెప్పారు. గత ఏడాది నీటిపారుదల ప్రాజెక్టుల కోసం రెండు వందలడెబ్బై అయిదు కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించగాచంద్రబాబు ప్రభుత్వం రెండు వందల అయిదుకోట్లు మాత్రమేఖర్చు చేసిందని ఆయన చెప్పారు. కొత్త ప్రభుత్వం ప్రధాన్యతలుమారినందువల్ల నీటి పారుదల ప్రాజెక్టులకు అధిక నిధులుకేటాయించాలని కోరినట్టు ఆయన తెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X