వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రలోనక్సల్స్‌తో కాంగ్రెస్‌ ఒప్పందం: అద్వానీ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:ఎన్నికల్లో గెలుపొందడానికి కాంగ్రెస్‌నక్సలైట్లతో సంబంధాలు పెట్టుకుందనిభారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడుఎల్‌.కె. అద్వానీ ఆరోపించారు. ఉల్ఫాతీవ్రవాదులతోనూ, నక్సలైట్లతోనూసంబంధాలు పెట్టుకొని కాంగ్రెస్‌ గెలించిందనిఆయన విమర్శించారు. ద్రవ్యోల్బణంపెరుగుదలకు నిరసనగా బిజెపి బుధవారంర్యాలీ నిర్వహించింది.

కాంగ్రెస్‌సామన్య ప్రజలను దోపిడీ చేస్తోందనిఆయన వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి, అద్వానీలతో పాటు వందలాదిమంది పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగాఅరెస్టయ్యారు. వారిని ఢిల్లీ అంబేడ్కర్‌స్టేడియంలో నిర్బంధించారు. గత ఏడునెలల యుపిఎ పాలన వల్ల జాతీయభద్రతకు కూడా ముప్పు వాటిల్లిందనిఅద్వానీ అన్నారు.ఆంధ్రప్రదేశ్‌లోనక్సలైట్లతోనూ, అస్సాంలో ఉల్ఫాతోనూకాంగ్రెస్‌ ఒప్పందం చేసుకుందని,తాము అధికారంలోకి వస్తే నిషేధంఎత్తేస్తామని ఆంధ్రప్రదేశ్‌లోనక్సలైట్లతో అంగీకారానికి వచ్చిందనిఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X