ఆయుధాలస్వస్తిపై నక్సల్స్తో ప్రత్యేకచర్చలు: జానా
కాకినాడ:ఆయుధాలను వదిలిపెట్టే విషయంపైనక్సలైట్లతో ప్రత్యేక చర్చలుజరుపుతామని హోం మంత్రి కె. జానారెడ్డిచెప్పారు. కాకినాడలో జరిగిన ఒకకార్యక్రమంలో బుధవారం ఆయనపాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనవిలేకరులతో మాట్లాడారు.
జటిలమైనసమస్యలన్నీ పరిష్కారమయ్యే వరకునక్సలైట్లతో ప్రభుత్వం చర్చలుజరుపుతుందని ఆయన చెప్పారు.అయితే శాంతిభద్రతలకు విఘాతంకలిగించే చర్యలకు పాల్పడితే పోలీసులుతగిన విధంగా ప్రతిస్పందిస్తారనిఆయన చెప్పారు. నక్సలైట్లతోచర్చలకు ప్రభుత్వం తీసుకున్నచర్యలు సత్ఫలితాలు ఇస్తోందని ఆయనచెప్పారు. గత ఆరు నెలలుగా ప్రాణ, ఆస్తినష్టాలు జరగలేదని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో ముఠా కక్షలఅంతానికి ప్రభుత్వం కఠినంగావ్యవహరిస్తుందని ఆయనచెప్పారు.











Click it and Unblock the Notifications
