ఈహీరోయిన్ల తీరు ఇదా?:మోహన్బాబు
హైదరాబాద్:తెలుగు సినీ తారల క్రికెట్ మ్యాచ్లోపాల్గొనడానికి ఫ్లయిట్ టికెట్లు పంపాలనికొందరు హీరోయిన్లు అడగడం పట్లమూవీ ఆర్టిస్టుల సంఘం (మా) అధ్యక్షుడుమోహన్ బాబు ఆవేదన వ్యక్తంచేశారు. ఒక మంచి పని కోసంజరుగుతున్న కార్యక్రామానికి రావాలనిఉత్తరాలు రాస్తే ఫ్లయిట్ టికెట్లుపంపాలని కొంతమంది హీరోయిన్లుఅడిగారని, ఇది సిగ్గుచేటు అని ఆయనశుక్రవారం మీడియా ప్రతినిధులతోఅన్నారు.
ఆదివారంజరిగే సినీ స్టార్స్ క్రికెట్ మ్యాచ్లఏర్పాట్లను ఆయన మరింత మందిఆర్టిస్టులతో కలిసి పర్యవేక్షించారు.కొంత మంది హీరోయిన్లయినా ఈమ్యాచ్లో పాల్గొనడానికి వస్తారనిఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.హైదరాబాద్లో ఇళ్లు లేనివారికి బోర్డింగ్,లాడ్జింగ్ వసతులు కల్పిస్తామని,ఫ్లయిట్ టికెట్లు మాత్రం వారే కొనుక్కొనివస్తే మంచిదని ఆయన అన్నారు.కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తేమంచిదని, రాకుంటే దేవుడేచూసుకుంటాడని ఆయన అన్నారు.
ఈమ్యాచ్ల ద్వారా వచ్చే సొమ్ములో ఇరవైలక్షల రూపాయలు సునామీ బాధితుల కోసం,ఇరవై లక్షల రూపాయలు ఆత్మహత్యలుచేసుకున్న రైతుల కుటుంబాల కోసంఅందజేస్తామని, మిగతా మొత్తాన్నినటీనటుల సంక్షేమం కోసంఉంచుతామని ఆయన వివరించారు.
చిరంజీవి,బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునటీమ్లు ఆదివారం జరిగే మ్యాచ్ల్లో పోటీపడుతాయి. ఈ మ్యాచ్ల కోసం సినీ నటులుకొద్దిరోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు.