వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆయుధంవీడితేనే మావోయిస్టులతో చర్చలు: వైఎస్
గుంటూరు:ఆయుధం వీడితేనే మావోయిస్టులతోరెండో విడత చర్చలు జరుపుతామనిముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిస్పష్టం చేశారు. రాజీవ్ నగర బాటకార్యక్రమంలో భాగంగా ఆయన శనివారంగుంటూరు జిల్లాలోని వివిధపట్టణాల్లో పర్యటించారు. సాగునీటి ప్రాజెక్టుల టెండర్లకుఅనుకూలంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడం పట్లఆయన హర్షం వ్యక్తం చేశారు. మాచర్ల పట్టణంలో ఆయనబహిరంగసభలో ప్రసంగించారు.ముస్లిం రిజర్వేషన్లకు తాము కట్టుబడిఉన్నామని ఆయన చెప్పారు. మునిసిపాలిటీలసమస్యల పరిష్కారానికి కృషి చేస్తామనిఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి సభలనుబహిష్కరించవలసిందిగా మావోయిస్టులుపిలుపు ఇచ్చిన నేపధ్యంలో పోలీసులుఆయనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేశారు. వైఎస్ సభలకు ఉదయం జనంపల్చగా హాజరైనా క్రమంగా పెరిగారు.
Comments
Story first published: Saturday, February 12, 2005, 23:53 [IST]