టెండర్లుఎందుకు రద్దు చేశారు?: టిడిపి
హైదరాబాద్:సాగునీటి ప్రాజెక్టుల రెండో కెటగిరీటెండర్లను ఎందుకు రద్దు చేశారోచెప్పాలని తెలుగుదేశం నాయకులు టి.దేవేందర్ గౌడ్, నాగం జనార్దన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అంచనా వ్యయం కన్నా ముప్పై శాతంతక్కువకు కోట్ అయిన టెండర్లనురద్దు చేసి వాటిని భారీ కుంభకోణంజరిగిన ఒకటో కెటగిరీ టెండర్లలో కలిపారని,డబ్బులు కొల్లగొట్టడానికే ఈ తతంగానికిపాల్పడ్డారని వారు మంగళవారంవిలేకరుల సమావేశంలో అన్నారు.
అంచనావ్యయానికి మించి కోట్ అయిన ఒకటో కెటగిరీటెండర్లను రద్దు చేయడానికి బదులుతక్కువ కోట్ అయిన రెండో కెటగిరీటెండర్లను రద్దు చేయడమేమిటనివారు ప్రశ్నించారు. ఏడు బిడ్లను మూడుబిడ్ల కిందికి మార్చి రేపు టెండర్లుపిలుస్తున్నారని వారు చెప్పారు.పోలవరం ప్రాజెక్టుకు టెండర్లుపిలవకుండా కాల్వలకు, పిల్ల కాల్వలకుటెండర్లు పిలవడంలోని ఆంతర్యాన్నిఎవరైనా అర్థం చేసుకోగలరనివారన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలోలేవనెత్తుతామని వారుచెప్పారు.