వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాఖి హత్యకేసులో మరొకరి అరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:సాగునీటి ప్రాజెక్టుల వ్యవహారంసోమవారం శాసనసభనుకుదేపేసింది. తాము చేపట్ట దలిచిన 26ప్రాజెక్టులలో ఐదు ప్రాజెక్టులకు త్వరలోఆమోదం లభిస్తుందని, ఆరు ప్రాజెక్టులకుపూర్తి అనుమతులున్నాయని, 15ప్రాజెక్టులకు అనుమతులు అవసరంలేదని భారీ నీటి పారుదల శాఖ మంత్రిపొన్నాల లక్ష్మయ్య చెప్పారు.

అనుమతులులేకుండా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికిటెండర్లు ఎందుకు పిలిచారని ఎ.యస్‌.మనోహర్‌ (తెలుగుదేశం)ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యమైనప్రాజెక్టులకు అనుమతుల లేవనిఆయన అన్నారు. గత ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు గోదావరి నదిపైదేవాదుల ప్రాజెక్టుకు పునాది రాయి వేసి18 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని, ఆరకంగా చంద్రబాబు తెలంగాణ ప్రజలనుమభ్య పెట్టడానికి ప్రయత్నించారనిమందడి సత్యనారాయణ రెడ్డి(తెలంగాణ రాష్ట్ర సమితి) అన్నారు.దేవాదుల ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేయడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారోచెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. ఒక్క ప్రాజెక్టుకు అటవీ శాఖ అనుమతిలేదని, అనుమతులన్నింటిలో ఈ శాఖఅనుమతే సులభమని, అటువంటప్పుడు ఈప్రభుత్వం ప్రాజెక్టులకు అనుమతితెస్తుందని ఎలా ఆశించగలమని టి.దేవేందర్‌ గౌడ్‌ (తెలుగుదేశం)అన్నారు.

నీటిపారుదల ప్రాజెక్టులకు అన్నింటికీఅనుమతులు తెస్తామని, అందుకుతాము కృషి చేస్తున్నామని మంత్రిలక్ష్మయ్య చెప్పారు. టెండర్లలోకమీషన్లు, ముడుపు తీసుకుంటున్నారనేఆరోపణలను ఆయన ఖండించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X