నక్సల్స్తోచర్చలపై జానా బిజీబిజీ మీట్స్
హైదరాబాద్:నక్సలైట్లతో రెండో విడత చర్చలపునరుద్ధరణకు హోం మంత్రి కె.జానారెడ్డి విస్తృతంగా చర్చలుజరుపుతున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె.కేశవరావుతో ఆయన పార్టీకార్యాలయం గాంధీభవన్లోసమావేశమయ్యారు. అనంతరం ఆఇరువుకు కలిసి ముఖ్యమంత్రికార్యాలయానికి వచ్చారు. ముఖ్యమంత్రిడాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డితోకేశవరావు, జానారెడ్డిసమావేశమయ్యారు.
నక్సలైట్లతోచర్చల పునరుద్ధరణ గురించిముఖ్యమంత్రితో తాము మాట్లాడలేదనిహోం మంత్రి జానారెడ్డి మీడియాప్రతినిధులతో అన్నారు. ముఖ్యమంత్రినితరుచుగా కలవడంఆనవాయితీయేనని, అందులో భాగంగానేకలిశామని ఆయన చెప్పారు.నక్సల్స్తో చర్చల గురించి మాట్లాడారా అనిఅడిగితే లేదని, చర్చలు జరిపేవారితోనేచర్చలు చేయాలి కదా అని ఆయనజవాబిచ్చారు. నక్సల్స్తో రెండోవిడత చర్చలపై ముఖ్యమంత్రితోమాట్లాడారని అంటున్నారని అంటే అదేం లేదనిఆయన అన్నారు. ముఖ్యమంత్రితోకేశవరావు, జానారెడ్డి చర్చలపునరుద్ధరణ గురించి మాట్లాడినట్లుతెలుస్తోంది.
ముఖ్యమంత్రితోసమావేశమైన అనంతరంజానారెడ్డి, కేశవరావు ప్రభుత్వప్రధాన కార్యదర్శి మోహన్ కందాతో,పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి)స్వరణ్జిత్ సేన్తోసమావేశమయ్యారు.