సస్పెన్షన్లకునిరసనగా అసెంబ్లీ నుంచి బిజెపి వాకౌట్
హైదరాబాద్:ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీసభ్యుల సస్పెన్షన్కు నిరసనగాభారతీయ జనతా పార్టీ (బిజెపి)శాసనసభ్యులు మంగళవారంనాడుశాసనసభ నుంచి వాకౌట్ చేశారు. ఒకశాసనసభ్యుడి హత్యపై చర్చకుప్రభుత్వం అంగీకరించకపోవడందారుణమని బిజెపి పక్ష నాయకుడు జి.కిషన్ రెడ్డి విలేకరులతో అన్నారు.రక్షణ అడిగిన తర్వాత పరిటాల రవిహత్య జరిగిందని, అందువల్లతెలుగుదేశం సభ్యులకు ఉండేవేదన ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థంచేసుకోవచ్చునని ఆయన అన్నారు.
తెలుగుదేశంసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి సభలోపార్లమెంటరీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారోలేదో గానీ పరిటాల హత్యపై సభ బయటచేయడం తాను విన్నానని, అందుకునాగం జనార్దన్ రెడ్డిని ఒక్కడిని కాకుండాతెలుగుదేశం సభ్యులందరినీ సస్పెండ్చేయడం సరి కాదని ఆయన అన్నారు.ప్రతిపక్షాలు లేకుండా సభనునిర్వహించడం సరైంది కాదని ఆయనఅన్నారు. తెలుగుదేశం సభ్యులసస్పెన్షన్ను ఉపసంహరించుకోవాలనికిషన్ రెడ్డి స్పీకర్ను కోరారు.
తెలుగుదేశంశాసనసభ్యుల సస్పెన్షన్ కాలాన్ని పదిరోజుల నుంచ ఒకటి రెండు రోజులకుతగ్గించాలని మజ్లీస్ పక్ష నాయకుడుఅక్బరుద్దీన్ ఓవైసీ స్పీకర్కుసూచించారు. నాగం వ్యాఖ్యలు,తదనంతర పరిణామాలుబాధాకరమని ఆయన అన్నారు.తెలుగుదేశం సభ్యుల సస్పెన్షన్పరిణామాలు బాధాకరమని సిపియంపక్ష నాయకుడు నోముల నర్సింహయ్యఅన్నారు. తెలుగుదేశం ప్రభుత్వహయాంలో విద్యుత్పై చర్చసందర్భంలో ఇలాగే జరిగిందని ఆయనఅన్నారు.












Click it and Unblock the Notifications
