సోనియాపైసుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్
న్యూఢిల్లీ:కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపైఫిర్యాదును నమోదు చేసుకోవాలనిజనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామిమంగళవారంనాడు సుప్రీంకోర్టునుకోరారు. గత సాధారణ ఎన్నికలసమయంలో సోనియా గాంధీ రాయబరేలీనియోజకవర్గం నుంచి నామినేషన్పత్రాలు దాఖలు చేస్తూ కావాలనే తెలిసితన గురించి తప్పుడు సమాచారంఇచ్చారని ఆయన ఆరోపిస్తూసుప్రీంకోర్టుకెక్కారు.
రిటర్నింగ్అధికారికి సమర్పించిన ప్రతిజ్ఞకుసంబంధించి తన కేంబ్రిడ్జీవిశ్వవిద్యాలయం తప్పుడు డిక్లరేషన్ఇచ్చారని ఆయన తన పిటిషన్లోఆరోపించారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోసోనియా చదివినట్లు రికార్డుల్లో ఎక్కడాలేదని, ఆమెపై ఎఫ్ ఐ ఆర్ నమోదుచేయడానికి అవసరమైన సమాచారంరిటర్నింగ్ ఆఫీసర్ వద్ద ఉన్నదనిసుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఈ విషయమైతాను ఎన్నికల కమీషన్కు, రిటర్నింగ్అధికారికి ఫిర్యాదు చేశారని, అయితేతన విజ్ఞప్తి తోసివేతకు గురైందనిఆయన చెప్పారు.